నగరంలోని పేదలకు, రోజువారీ కూలీలకు, ఆటోడ్రైవర్లకు, విద్యార్థులకు భోజన భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సెప్టెంబర్ 29, సోమవారం నాడు మోతీనగర్ మరియు ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లో కొత్త క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు.
రూ.5కే పౌష్టిక భోజనం అందించే ఈ ప్రత్యేక పథకం పేదల పాలిట వరంగా మారింది. ఇప్పటికే ఈ పథకం ద్వారా వేలాది మంది లబ్ధి పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 150 క్యాంటీన్లు నడుస్తున్నాయి. వీటివల్ల రోజుకు సగటున 30 వేల మంది వరకు భోజనం పొందుతున్నారు.
ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 12.3 కోట్ల భోజనాలు పంపిణీ చేశారు. దీనికై ప్రభుత్వం రూ.254 కోట్లకుపైగా ఖర్చు చేసింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నిరంతరంగా భోజన భద్రత కల్పించే ప్రయత్నం జరుగుతోంది.
కొత్తగా ప్రారంభించిన క్యాంటీన్లలో ఆధునిక ఫెసిలిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో ఫుడ్ కంటైనర్లు, కూర్చునే సదుపాయం, తాగునీటి ఆర్వో ప్లాంట్, చేతులు కడుక్కునే వసతి, డ్రైనేజీ మరియు ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఉన్నాయి. ఇవి పౌరులకు మరింత సౌకర్యవంతంగా భోజనం అందించేందుకు దోహదపడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa