ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ప్రణాళికని స్వాగతించిన మోడీ

national |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 05:19 PM

గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రణాళికను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ప్రతిపాదన పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు దీర్ఘకాలిక శాంతి, భద్రతను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలో సుస్థిరతకు ఈ ప్లాన్ దోహదపడుతుందని పేర్కొన్నారు.మంగళవారం వైట్‌హౌస్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయిన అనంతరం ట్రంప్ ఈ 20 సూత్రాల శాంతి ప్రణాళికను అధికారికంగా వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "గాజా వివాదాన్ని ముగించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సమగ్ర ప్రణాళికను మేం స్వాగతిస్తున్నాం. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలతో పాటు పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక శాంతి, భద్రత, అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది" అని ఆయన తన పోస్టులో తెలిపారు. ట్రంప్ చొరవకు అందరూ మద్దతివ్వాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa