ఇండోనేషియాలోని తూర్పు జావా రాష్ట్రంలో సిడోర్జో నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి అల్ ఖోజిని ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడగా, వందల మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.
భవనం కూలిన సమయంలో చాలా మంది విద్యార్థులు క్లాసుల్లో, హాస్టళ్లలో ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 91 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారు. సహాయక బృందాలు రోజూ మరింత లోతుగా తవ్వకాలు నిర్వహిస్తూ, వారికి నీరు, ఆక్సిజన్ అందజేస్తూ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే భవనం పాతదై ఉండడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa