విశాఖ జిల్లా వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఉత్తర నియోజక వర్గంలో పెన్షన్లను విశాఖ ఎంపీ శ్రీ భరత్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. జీవీఎంసీ పరిధిలో 44వ వార్డులో పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. కొంతమంది తమకు అర్హత ఉన్నా, పెన్షన్లు రావడం లేదని చెబుతున్నారన్నారు. వారి సమస్యలను పరిష్కరించి.. అర్హులందరికీ పెన్షన్లు వచ్చేలా కృషి చేస్తామని ఎంపీ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa