ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విజయనగరం జిల్లాలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 02:16 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 85 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యింది. అత్యధికంగా అనంతపురం, విజయనగరం జిల్లాలో 90 శాతంపైగా పెన్షన్లను అందజేశారు. 63.50 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 54.32 లక్షల మంది లబ్ధదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు. మరికాసేపట్లో విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో పింఛన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపిణీ చేయనున్నారు.అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నారు సీఎం. ఉదయం నుంచి సాయంత్రం వరకు దత్తి గ్రామంలో పలు ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa