ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతదేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకె వికసిత భారత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 02:17 PM

బీజేపీ ప్రభుత్వంలో భారతదేశ ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. స్వజాతి, స్వదేశీపై గౌరవ భావం కలిగేలా మోదీ పాలన, నిర్ణయాలు ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ఆత్మ నిర్బర్ భారత్ అమలు చేస్తుందని చెప్పారు. ‘అమెరికా.. మన దేశం మీద సుంకాల యుద్ధం, ఆంక్షలు ప్రకటించింది. మన దేశం అన్ని విధాలా ఎదగాలని మోదీ స్వదేశీ నినాదాన్ని తీసుకున్నారు’ అని మాధవ్ తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా ఇదే స్వదేశీ ఉద్యమంలో మహనీయులు పాల్గొన్నారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఇతరుల‌ ఆదేశాల మేరకు మన దేశంలో నిర్ణయాలు జరిగాయన్నారు. విదేశీ ఆలోచనలతో, విదేశీ కంపెనీలు ప్రోత్సహించారని... ఖాధీని పక్కన పెట్టడం వల్ల భారతదేశం బలహీన పడిందన్నారు. ప్రతి విషయంలో విదేశాలపై ఆధార పడే పరిస్థితికి తెచ్చారని విమర్శించారు. ఏ చిన్న పరికరం‌ కావాలన్నా కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విధంగా చేశారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa