ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖాదీ సంత కార్యక్రమంలో చరఖాను తిప్పిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 12:12 PM

విజయవాడ నగరంలోని ఎస్.ఎస్.కన్వెన్షన్‌లో నిర్వహించిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా.. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన చరఖాను స్వయంగా చంద్రబాబు తిప్పారు. అనంతరం స్వదేశీ సంత ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమీవృక్ష పూజను తెలంగాణలో చాలా బాగా చేస్తారని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. సమీవృక్ష ఆకులను తెల్ల బంగారంగా అభివర్ణిస్తారని, శత్రువులంతా నాశనం అవ్వాలని జేబుల్లో వేసుకుంటారని ముఖ్యమంత్రి వివరించారు. దసరా రోజు పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఖాదీ సంతలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, అక్కడ ఉన్న చేతి వృత్తుల వారితో మాట్లాడి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa