ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగా డీఎస్సీ నిర్వహణ కోసం లోకేష్ ఎంతో కష్టపడ్డారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 12:12 PM

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ కోసం ఒక తపస్సే చేశారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మెగా డీఎస్సీ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఈ మెగా డీఎస్సీ విషయంలో 140 కోర్టు కేసులు వేశారని ఆమె గుర్తు చేశారు. విద్యా వ్యవస్థలో మంత్రి లోకేశ్ ఎన్నో మార్పులు తీసుకు వచ్చారంటూ సోదాహరణగా వివరించారు. పాఠశాల అంటే ఒక దేవాలయం అని భావించి-ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని లోకేష్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి హోం మంత్రి అనిత భోజనం చేశారు. గురువారం దసరా పర్వదినం నేపథ్యంలో మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో మెగా డిఎస్సీకి ఎంపికైనా ఉపాధ్యాయులకు వేంపాడు టోల్ ఫ్లాజా సమీపంలో భారతీ కన్వెన్షన్ హాల్‌లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో తొమ్మిది డీఎస్సీలు నిర్వహించారని చెప్పారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను టీచర్‌నని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa