తిరుపతిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం సుమారు రెండు గంటలపాటు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులకు తిరుపతికి వస్తుంటారు. ఇలా వచ్చే భక్తులతో తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ వంటి ప్రాంతాలు కిటికిటలాడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే తిరుపతి రైల్వేస్టేషన్, విష్ణునివాసం, లింక్ బస్టాండ్ వంటి ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం రోజు ఉదయం రెండు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. తిరుపతికి బాంబు బెదిరింపు మెయిల్స్ రావటంతోనే తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
మరోవైపు తమిళనాడులోని పలువురు ప్రముఖులకు తాజాగా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సీఎం స్టాలిన్, బీజేపీ ఆఫీస్, సినీ నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. అందులో తిరుపతి పేరు కూడా ఉన్నట్లు తమిళనాడు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తిరుపతి పోలీసులు అప్రమత్తమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా పోలీసు ప్రత్యేక విభాగం అలర్ట్ అయ్యింది. అందులో భాగంగా తిరుచానూరు, తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల్లో తనిఖీలు చేపట్టారు. పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. తిరుపతిలోని ఆరు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పోలీుల తనిఖీల్లో ఎలాంటి ప్రమాదకర వస్తువులు లభించనట్లు తెలిసింది.
మరోవైపు తమిళనాడులో బాంబు బెదిరింపులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇంటితో పాటుగా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం, డీజీపీ కార్యాలయం, రాజ్ భవన్, సినీ నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో తమిళనాడు పోలీసులు . భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీమ్లు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీలలో ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదని సమాచారం. అయితే ముందు జాగ్రత్తగా చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇలాంటి బెదిరింపులు రావటం ఇటీవల ఇది మూడోసారి కావడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa