ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఆటలకి ఇండియా జట్టు ఖరారు

sports |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 05:08 PM

ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్, టీ20 సిరీస్ ల కోసం కోసం నేడు టీమిండియా జట్లను  ప్రకటించారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని వన్డే జట్టును ప్రకటించినట్టు అర్థమవుతోంది. రోహిత్ శర్మ స్థానంలో భారత వన్డే కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను నియమించారు. గిల్ ఇప్పటికే టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వన్డే జట్టులో స్థానం కల్పించారు. వైస్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ ను నియమించారు. ఆంధ్రా క్రికెట్ స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారిగా భారత వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అతడిని ఆల్ రౌండర్ కోటాలో తీసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాకు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ మేరకు నేడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సమావేశమైన టీమిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa