ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకుల పాఠశాలలో విద్యార్థినులకి పచ్చకామెర్ల కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 05, 2025, 06:19 PM

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థినులు పచ్చకామెర్లతో బాధపడుతుండడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో పచ్చకామెర్ల వ్యాధి 5 శాతం కంటే ఎక్కువ ఉన్న విద్యార్థినులను అధికారులు మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు పార్వతీపురం ఆసుపత్రిలో గురుకులం సెక్రటరీ గౌతమి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినిలు పచ్చకామెర్ల బారిన పడడానికి గల కారణాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు.ఈ విషయంపై రాష్ట్రస్థాయి అధికారుల బృందం దర్యాప్తు చేస్తున్నారని గౌతమి పేర్కొన్నారు. నీటి వల్ల ఈ వ్యాధి వచ్చిందనే అనుమానంతో అక్కడ వాటర్‌ను పరీక్షించినట్లు తెలిపారు. నీటిలో ఎటువంటి సమస్య లేదని నిర్ధారణ అయిందని వివరించారు. పచ్చకామెర్లు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్న విద్యార్థినులు మొత్తం 36 మంది ఉన్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 120 మంది విద్యార్థినిలు చికిత్సపొందుతున్నట్లు గౌతమి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa