వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో తల్లిని చంపిన తనయుడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యశ్వంత్ కుమార్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని వార్తలు వస్తున్నాయి. అయితే తాను దేవుణ్ని అంటే నమ్మలేదనే తల్లిని చంపినట్లు యశ్వంత్ కుమార్ రెడ్డి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..ప్రొద్దుటూరులోని శ్రీరామ్నగర్కు చెందిన విజయభాస్కర్రెడ్డి, లక్ష్మీదేవి దంపతుల ఏకైక సంతానం యశ్వంత్ కుమార్ రెడ్డి. లక్ష్మీదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఒక్కడే కొడుకు కావటంలో యశ్వంత్ కుమార్ రెడ్డిని గారాబంగా పెంచారు ఆ దంపతులు. కొడుకును బాగా చదివించి ప్రయోజకుడిని చేయాలనే ఉద్దేశంతో చెన్నైలో ఇంజినీరింగ్ చదివించారు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే యశ్వంత్ కుమార్ రెడ్డి.. ఉద్యోగాన్వేషణలో భాగంగా హైదరాబాద్కు పంపించారు. ప్రతి నెలా ఖర్చుల కోసం డబ్బులు పంపించేవారు.
ఈ క్రమంలోనే ఈ మధ్యనే ఒకసారి మూడు వేలు పంపించగా.. కొన్ని రోజులకే మరో పదివేలు కావాలని యశ్వంత్ రెడ్డి అడగటంతో తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో తల్లి మీద కోపం పెంచుకున్న యశ్వంత్ రెడ్డి.. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు చేరుకుని తల్లితో గొడవ పడ్డాడు. తండ్రిని గదిలో బంధించి తల్లి గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. కూరగాయలు కోసే కత్తితో కన్నతల్లి గొంతుకోసిన యశ్వంత్ రెడ్డి.. ఆ తర్వాత లక్ష్మిదేవి వరండాలోకి ఈడ్చుకుని వచ్చి పడేశాడు. ఆ తర్వాత తలుపులు బిగించుకుని టీవీలో పాటలు వింటూ కూర్చున్నాడు.
హైదరాబాద్లో ఒక్కడే రూమ్లో..
మరోవైపు ఉద్యోగ ప్రయత్నాల కోసం హైదరాబాద్ చేరిన యశ్వంత్ రెడ్డి.. ఇన్నేళ్లు హైదరాబాద్లో ఒక్కడే రూమ్లో ఉంటున్నట్లు బంధువులు చెప్తున్నారు. ప్రతినెలా యశ్వంత్ ఖర్చుల కోసం ఇంటి నుంచి డబ్బులు పంపేవారని చెప్తున్నారు. అయితే యశ్వంత్ మానసిక స్థితిలో మార్పును గమనించిన అతని తల్లిదండ్రులు.. ఇంటికి వచ్చేయాలని కోరినా అతను వినిపించుకోలేదంటున్నారు. కేవలం డబ్బుల కోసం మాత్రమే యశ్వంత్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసేవాడని తెలిసింది.
నేను దేవుణ్ని..
మరోవైపు హైదరాబాద్ నుంచి ఆదివారం ఉదయం ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకున్న యశ్వంత్ రెడ్డి.. వచ్చిన వెంటనే తల్లితో గొడవ పడినట్లు తెలిసింది. తాను దేవుణ్ని అని.. అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలంటూ లక్ష్మిదేవితో గొడవపడినట్లు సమాచారం. పోలీసుల విచారణలోనూ యశ్వంత్ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. తాను దేవుడిని అంటే తల్లి నమ్మడం లేదని.. అందుకే దేవుడి వద్దకు పంపించానని యశ్వంత్ చెప్పినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే యశ్వంత్ రెడ్డి మానసిక స్థితిగతులపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. హైదరాబాద్లో అతను ఉన్న పరిస్థితులు.. గతంలో మానసిక సమస్యలతో ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డారా అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా ఒక్కగానొక్క కొడుకు అంటూ గారాబంగా పెంచిన కన్నతల్లినే.. ఓ కొడుకు అమానుషంగా గొంతుకోసి హత్య చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa