ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్న తేజస్వి

national |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 07:36 PM

బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రీయ జనతా దళ్  కీలక నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకటి తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాఘోపుర్ కాగా, మరొకటి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ యునైటెడ్ కు బలమైన పట్టున్న ఫుల్పరాస్ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.మధుబని జిల్లా పరిధిలోని ఫుల్పరాస్ నియోజకవర్గం 2010 నుంచి జేడీయూకు అడ్డాగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ జేడీయూకు చెందిన శీలా కుమారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి కృపానాథ్ పాఠక్‌పై సుమారు 11,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాంటి బలమైన స్థానంలో తేజస్వి నేరుగా పోటీకి దిగడం ద్వారా అధికార పార్టీకి గట్టి సవాల్ విసరాలనే వ్యూహంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ విజయం సాధిస్తే అది ఆర్జేడీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు, జేడీయూకు రాజకీయంగా పెద్ద దెబ్బ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు, రాఘోపుర్ నియోజకవర్గం యాదవ్ కుటుంబానికి దశాబ్దాలుగా రాజకీయంగా అండగా నిలుస్తోంది. గతంలో తేజస్వి తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. 2015లో రాజకీయ అరంగేట్రం చేసిన తేజస్వి, 2020 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్‌పై 38,000 ఓట్లకు పైగా భారీ మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఈసారి ఒకవైపు సురక్షితమైన సొంత స్థానాన్ని నిలబెట్టుకుంటూనే, మరోవైపు ప్రత్యర్థి కోటను బద్దలు కొట్టాలనే లక్ష్యంతో తేజస్వి ఈ డబుల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa