ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం ధాటికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారు.మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు జరిగిన సమయంలో ఈ బాణసంచా తయారీ కేంద్రంలో 40 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa