ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని పర్యటనకి పటిష్టమైన ఏర్పాట్లు చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 09:26 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 16న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో, ఆయన పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనను గతంలో అమరావతి, విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమాలను మించి విజయవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మొదట ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలాన్ని సందర్శించి, భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్నారు. అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ-2.0 సంస్కరణలకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్' కార్యక్రమంలో భాగంగా ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సంస్కరణలను స్వాగతిస్తూ దేశంలోనే తొలిసారిగా ఏపీ అసెంబ్లీలో అభినందన తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దసరా నుంచి దీపావళి వరకు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాని సభను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, ఆహార సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. సభా ప్రాంగణానికి వెళ్లే అప్రోచ్ రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa