ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చర్చనీయాంశంగా మారిన ఆసియా కప్ 2025 ట్రోఫీ

sports |  Suryaa Desk  | Published : Thu, Oct 09, 2025, 05:05 PM

ఆసియా కప్ 2025 ట్రోఫీ ఎక్కడుంది? ఈ ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ట్రోఫీని అందజేయకుండా అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్, పాకిస్థాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ, ఈ వివాదంపై నోరు మెదపడం లేదు. తాజాగా మీడియా అడిగిన ప్రశ్నల నుంచి ఆయన సమాధానం చెప్పకుండా జారుకోవడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది.గత నెల దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఘన విజయం సాధించింది. అయితే, మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు ట్రోఫీని అందించాల్సిన ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయకుండానే ట్రోఫీ, పతకాలు సహా స్టేడియం నుంచి వెళ్లిపోయారు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్న ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.ఈ వారం కరాచీలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వివాహ వేడుకకు హాజరైన నఖ్వీని మీడియా ప్రతినిధులు ట్రోఫీ గురించి ప్రశ్నించారు. "ఆసియా కప్ ట్రోఫీ భవిష్యత్తు ఏంటి?" అని ఓ విలేకరి అడగ్గా, ఆయన జవాబు చెప్పకుండా మౌనం పాటించారు. అక్కడే ఉన్న పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది, నఖ్వీని మీడియా నుంచి తప్పించి ఆయన కారు వద్దకు తీసుకెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa