ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరోసారి మార్కెట్లో సంచలనానికి తెరలేపింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 వేదికగా భద్రతకు పెద్దపీట వేస్తూ కొత్త శ్రేణి 'జియోభారత్' ఫోన్లను ఆవిష్కరించింది. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ 'సేఫ్టీ-ఫస్ట్' ఫోన్ల ప్రారంభ ధర కేవలం రూ.799 మాత్రమే కావడం విశేషం. దీంతో పాటు విద్యార్థుల కోసం ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సును కూడా ప్రకటించింది.ఈ కొత్త జియోభారత్ ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్, యూసేజ్ మేనేజ్మెంట్ వంటి కీలక ఫీచర్లను పొందుపరిచారు. లొకేషన్ ట్రాకింగ్ ద్వారా ఫోన్ వాడుతున్న వారు తమ రియల్-టైమ్ లొకేషన్ను నమ్మకమైన కాంటాక్ట్స్తో పంచుకోవచ్చు. ఇక 'యూసేజ్ మేనేజర్' టూల్ ద్వారా పిల్లలు లేదా వృద్ధుల ఫోన్కు ఎవరెవరు కాల్ చేయాలి, మెసేజ్ పంపాలి అనే దానిపై సంరక్షకులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. దీనివల్ల గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ను సులభంగా బ్లాక్ చేయవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ రావడం ఈ ఫోన్ల మరో ప్రత్యేకత. ఈ ఫోన్లు జియో స్టోర్లు, జియోమార్ట్, అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ సహా ఇతర ఆఫ్లైన్ రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. అనవసరమైన కాల్స్, సోషల్ మీడియా వంటి వాటి నుంచి తమ ఆత్మీయులను దూరంగా ఉంచాలనుకునే కుటుంబాలకు ఈ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని జియో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa