ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2008 నాటి ముంబై ఉగ్రదాడుల నేపథ్యంపై నా మాటలని వక్రీకరించారు

national |  Suryaa Desk  | Published : Thu, Oct 09, 2025, 05:09 PM

2008 నాటి ముంబై ఉగ్రదాడుల (26/11) అనంతరం నాటి యూపీఏ ప్రభుత్వం స్పందించిన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ప్రధాని ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి పి. చిదంబరం తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని, ఆయన చెప్పిన మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.బుధవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, 26/11 దాడుల తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ, ఓ విదేశీ శక్తి ఒత్తిడి కారణంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆరోపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ నేతే ఇటీవలి ఇంటర్వ్యూలో వెల్లడించారని, పేరు చెప్పకుండా చిదంబరాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ప్రధాని ఆరోపణలపై గురువారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చిదంబరం స్పందించారు. "ప్రధాని మోదీ చెప్పిన మాటలు పూర్తిగా తప్పు. ఆయన ఆ మాటలను ఊహించుకుని, వాటిని నాకు ఆపాదించడం నిరాశ కలిగించింది" అని పేర్కొన్నారు. ప్రధాని ప్రస్తావించినట్టుగా సైన్యాన్ని ఆపాలని ఏ విదేశీ శక్తి ఒత్తిడి చేయలేదని ఆయన స్ప‌ష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa