ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరమ్మతు పనుల కారణంగా తిరుపతికి వెళ్లే అన్‌ రిజర్వ్‌డ్‌ రైళ్ల సేవలో మార్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 04:38 PM

తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్‌కు బయల్దేరే రైలు, తిరుపతికి బదులు తిరుచానూరు నుంచి బయల్దేరనుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటన, మరమ్మతు పనుల కారణంగా చెన్నై సెంట్రల్‌ నుంచి తిరుపతికి వెళ్లే అన్‌ రిజర్వ్‌డ్‌ రైళ్ల సేవలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఆ ప్రకారం, అరక్కోణం తిరుపతి వెళ్లే రైలు శుక్రవారం నుంచి నవంబరు 5వ తేది వరకు తిరుపతికి బదులుగా తిరుచానూరు రైల్వేస్టేషన్‌ వరకు నడుపనున్నారు.మరుమార్గంలో తిరుపతి నుంచి అరక్కోణం బయల్దేరే రైలు తిరుపతికి బదులుగా తిరుచానూరు నుంచి బయల్దేరుతుంది. అలాగే, తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్‌ వెళ్లే రైలు తిరుపతికి బదులుగా తిరుచానూరు నుంచి, చెన్నై సెంట్రల్‌ నుంచి తిరుపతికి వచ్చే రైలు తిరుపతికి బదులు తిరుచానూరు వరకు మాత్రమే నడుస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa