వాతావరణ శాఖ ఏపీకి వర్ష సూచనలు జారీ చేసింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల వాతావరణ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర మరియు పరిసర ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వెల్లడించింది.ఆదివారం (12-10-25) అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాన కురుస్తున్నప్పుడు సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించింది.చిత్తూరులో 34.2 మిల్లీమీటర్ల వర్షపాతం, తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురంలో 31 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా కోర్లాంలో 26.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa