భారత ఆటోమొబైల్ రంగంలో వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ఫాస్ట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 9 నెలల వ్యవధిలోనే లక్షకు పైగా కార్లను విక్రయించి సంచలనం రేపింది. ఒకే ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లోనే ఈ ఘనత సాధించిన తొలి కార్ల బ్రాండ్గా నిలిచినట్లు కంపెనీ సోమవారం అధికారికంగా ప్రకటించింది.సెప్టెంబర్ నెలలో విన్ఫాస్ట్ 13,914 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమ్ముడైన మొత్తం కార్ల సంఖ్య 1,03,884కు చేరింది. భారత ఆటోమొబైల్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. గత 11 నెలలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల బ్రాండ్గా విన్ఫాస్ట్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.భారత మార్కెట్పై భారీ అంచనాలతో ఉన్న ఈ వియత్నాం కంపెనీ, తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడులోని తూత్తుకుడిలో భారీ అసెంబ్లీ ప్లాంట్ను ప్రారంభించింది. ఈ ప్లాంట్పై దశలవారీగా రూ. 16,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. తొలి దశలో భాగంగా, ఈ ప్లాంట్లో ఏటా 50,000 ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడళ్లు అయిన వీఎఫ్ 6, వీఎఫ్ 7 లను అసెంబుల్ చేయనున్నారు.ఈ విజయంపై విన్ఫాస్ట్ గ్లోబల్ డిప్యూటీ సీఈఓ డ్యూంగ్ థీ థు ట్రాంగ్ మాట్లాడుతూ, "మాపై నమ్మకం ఉంచిన వినియోగదారులకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారికి మరింత విలువైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం" అని తెలిపారు.కంపెనీ అమ్మకాల్లో వియత్నాం 'జాతీయ ఎలక్ట్రిక్ కారు'గా పిలిచే వీఎఫ్ 3 మోడల్ 31,386 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వీఎఫ్ 5 30,956 యూనిట్లు వీఎఫ్ 6 14,425 యూనిట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా తన ఉనికిని పటిష్టం చేసుకునేందుకు ఈ ఏడాది చివరి నాటికి 27 నగరాల్లో 35 డీలర్షిప్లను ప్రారంభించాలని విన్ఫాస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa