ట్రెండింగ్
Epaper    English    தமிழ்

13 రోజుల పాటు స్కూల్ బంద్, కారణాలు ఏంటి?

Education |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 09:41 PM

అక్టోబర్‌ నెల మొదలవుతుండగానే, విద్యార్థులు పండుగ వాతావరణంలో మునిగిపోతారు. దసరా హడావుడి ముగియగానే, మరో పెద్ద సెలవుల ప్యాకేజీ వార కొట్టింది.ఈసారి దాదాపు రెండు వారాల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ, ఒక రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం పండుగ ఉత్సవాలను మరింత ఘనంగా మార్చింది.ఈ మెగా సెలవులను ప్రకటించినది రాజస్థాన్ రాష్ట్రం. తెలంగాణలో బతుకమ్మ, దసరాను ఎంత రీతి ఘనంగా జరుపుతామో, రాజస్థాన్‌లో దీపావళికి ఆ రేంజ్‌లో ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల, రాజస్థాన్ విద్యా శాఖ ఆదేశాల ప్రకారం, అక్టోబర్ 13 (సోమవారం) నుండి అక్టోబర్ 24 వరకు పాఠశాలలకు విరామం ప్రకటించబడింది.ముందుగా వచ్చిన అక్టోబర్ 12 ఆదివారం కూడా కలిపితే, విద్యార్థులు, ఉపాధ్యాయులు సుమారు 13-14 రోజుల పాటు సెలవులను ఆస్వాదించనున్నారు. దీపావళి పండుగ ముందే వారి ఇంటికి చేరుకున్నట్లే పరిస్థితి. ఈ అనూహ్యమైన లాంగ్ బ్రేక్ వార్తతో స్కూల్ పిల్లల ఆనందానికి అంతులు తెలియట్లేదు.సెలవుల వర్షంతో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నా, వారి తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇంత సుదీర్ఘ కాలం పాఠశాలల నుంచి దూరంగా ఉండటం వల్ల పిల్లలు చదువులో వెనుకబడుతారేమో అని కొన్ని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. మరికొందరైతే, పిల్లలు ఇంట్లోనే ఉండటం కంటే పాఠశాలకి పంపడం మంచిదని భావిస్తున్నారు.అయితే, ఈ సెలవులను ఉపయోగించి చాలా కుటుంబాలు టూర్లు, పర్యటనలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. పిల్లల చదువుపై ఆందోళన ఉన్నా, పండుగ సంబరాలు, కుటుంబంతో కలిసి ఆనందించటానికి ఇదొక మంచి అవకాశం అని పేరెంట్స్ భావిస్తున్నారు.ఈ లాంగ్ బ్రేక్ ముగిసిన తర్వాత, విద్యార్థులు కొత్త ఉత్సాహంతో మళ్లీ పాఠశాలలకు చేరి చదువులోకి నడవనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa