ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్ రంజీ టీమ్‌ వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ ఎంపిక

sports |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 10:28 PM

13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలోకి వచ్చి.. 14వ ఏటనే ఐపీఎల్ సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ .. క్రికెట్‌లో దూసుకెళ్తున్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్‌-19 టీమ్‌ తరఫున పరుగుల వరద పారించిన ఈ ప్లేయర్‌కు.. ప్రమోషన్ లభించింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజ‌న్‌కు గాను వైభ‌వ్ సూర్య‌వంశీని బీహార్ క్రికెట్ అసోయేషిన్ కీలక బాధ్యతలు అప్పగించింది. జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపిక 


ప్ర‌తిష్టాత్మ‌క దేశవాళీ టోర్నీకి బీసీఎ సెల‌క్ట‌ర్లు సోమ‌వారం 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ‌ జ‌ట్టును ప్ర‌క‌టించారు. ఈ జట్టుకు సకిబుల్ గని కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్‌గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని బీహార్ క్రికెట్ అసోసియేషన్ ఎంపిక చేసింది. ఇక బీహార్ జ‌ట్టు రంజీ ట్రోఫీ 2025 , 2026లో తమ తొలి మ్యాచ్‌లో అక్టోబ‌ర్ 15న అరుణాచల్ ప్ర‌దేశ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. పియూష్ కుమార్ సింగ్, భాష్కర్ దూబే, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు సింగ్ వంటి ప్లేయ‌ర్లు సైతం బీహార్ జట్టులో చోటు సంపాదించారు.


ఐపీఎల్‌లో సత్తాచాటి..


టీమిండియా అండర్‌-19 జట్టు తరఫున అదరగొట్టిన వైభవ్.. ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు. ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరి వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్‌ రూ.1.1 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. వారి నమ్మకాన్ని నిలబెడుతూ ఓ మ్యాచ్‌లో 35 బంతుల్లోనే అతడు సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా సూర్యవంశీ రికార్డులకెక్కాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనలో దుమ్ములేపాడు. వైట్‌బాల్‌, రెడ్ బాల్ సిరీస్‌లు రెండింటిలోనూ రాణించాడు. తాజాగా రంజీ ట్రోఫీ వంటి టోర్నీలో వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.


రంజీ ట్రోఫీ కోసం బీహార్ జట్టు:


సకీబుల్ గని (కెప్టెన్‌), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్‌), పీయూష్ కుమార్ సింగ్, భాష్కర్ దూబే, అర్నవ్ కిషోర్, ఆయుష్ లోహరుక, బిపిన్ సౌరభ్, అమోద్ యాదవ్, నవాజ్ ఖాన్, సాకిబ్ హుస్సేన్, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు కుమార్, ఖలిద్, రాఘవేంద్ర ప్రతాప్ సింగ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa