ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం…

national |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 11:43 AM

నా వ్యక్తిగత ఓటమితో నా రాజకీయ చాణక్య, విశ్వసనీయతకు దెబ్బతినొద్దు అనే భావనతో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. హాజీపూర్ లేదా రఘోపూర్ లో పోటీ చెయ్యాలని మొదట నిర్ణయం. తన సంస్థ ఐప్యాక్ ద్వారా పలుమార్లు సర్వే చేసిన హాజీపూర్ లో మూడో స్థానం, తాను పుట్టి పెరిగిన గడ్డ రాఘోపూర్ అసెంబ్లీ నియోకవర్గంలో డిపాజిట్ గల్లంతు అయ్యే పరిస్థితి ఉంది అని నివేదిక రావడంతో తన ఓటమితో తన సంస్థకు, వ్యక్తిగత రాజకీయ విశ్వసనీయతకు మరింత నష్టం కలిగే అవకాశం ఉందని భావిస్తూ పోటీ చెయ్యడానికి దూరంగా ఉండాలని నిర్ణయం. 2026 ఎన్నికల కోసం తన ఐప్యాక్ సంస్థ పనిచేస్తున్న బెంగాల్, తమిళనాడు, తన ఓటమి ఆయా రాష్ట్రాలలో తాను పని చేస్తున్న రాజకీయ పార్టీల ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను సొంతంగా ఏర్పాటు చేసిన జన్ సురాజ్ పార్టీ బీహార్ లో 0 లేదా 1 స్థానం గెలిచే అవకాశం ఉన్నట్టు ఐప్యాక్ అంతర్గత సర్వేలో వెల్లడైంది. ప్రశాంత్ కిషోర్ బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీ తరుపున 665 రోజులలో 2,697 గ్రామాలలో ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa