గుంటూరు జిల్లా, తురకపాలెంలో గత ఆరు నెలల కాలంలో దాదాపు నలబై అయిదు మందికి పైగా మరణించారు. దీనికి కారణాలు ఏమిటీ అని నిర్ధారించడంలో ప్రభుత్వం విఫలమైంది అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ... గత రెండునెలల కిందట వైయస్ఆర్సీపీ ప్రతినిధిబృందంగా ఆ గ్రామాన్ని సందర్శించి ఈ మరణాలను వెలుగులోకి తీసుకువచ్చాం. అయినా కూడా దీనిపై ప్రభుత్వం ప్రాథమిక నిర్ధారణనకు రాలేక పోయింది. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజాగా ఇరవై నాలుగేళ్ళ మహిళ ఇదే తరహాలో అంతుపట్టని కారణాలతో మరణించారు. డీఎంఅండ్ హెచ్ఓ ఒక కారణం చెబితే, హెల్త్ సెక్రటరీ దానిని ఖండిస్తూ మరో కారణం చెప్పారు. వారి మధ్యే పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో నివసిస్తున్న ప్రజలు మరంత ఆందోళనతో ఉన్నారు. తాము గ్రామంలో నివసించాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికీ ఆసుపత్రుల్లో దాదాపు ఇరవై అయిదు మంది చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంతో తమకు న్యాయం చేయాలని వైయస్ జగన్ గారి దృష్టికి సమస్యను తీసుకువెళ్ళాలని కోరుతూ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. దీనిపై వైయస్ఆర్సీపీ ప్రతినిధి బృందం 15వ తేదీ (బుధవారం) తురకపాలెంకు వెడుతున్నాం. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తాం, స్థానికంగా భయాందోళనలతో ఉన్న ప్రజలకు భరోసా కల్పించడం, ప్రభుత్వాన్ని దీనిపై తక్షణం చిత్తశుద్దితో స్పందించేలా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa