కర్నూల్లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు స్వాగతం పలికారు. ఆ సమయంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.ఏపీ పర్యటనలో ఉన్న ప్రధాని ప్రస్తుతం.. శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని మోదీ దర్శించుకోనున్నారు. సుమారు 50 నిమిషాల పాటు భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో గడపనున్నారు. తర్వాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. సుమారు 40 నిమిషాల పాటు శివాజీ స్పూర్తి కేంద్రం ద్యాన మందిరంలో మోదీ గడుపుతారు. అనంతరం 1.30 గంటలకు శ్రీశైలం నుంచి బయలుదేరి కర్నూలు బహిరంగ సభకి బయలుదేరి వెళ్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa