ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇది డబల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 05:37 PM

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వాల కలయిక డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని, ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అభివర్ణించారు. వీరిద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అత్యంత వేగంగా ముందుకు దూసుకెళుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.గురువారం కర్నూలు జిల్లా నన్నూరు వద్ద ఏర్పాటు చేసిన 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' బహిరంగ సభలో మంత్రి లోకేశ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. "నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే" అని అన్నారు.భారతదేశాన్ని ప్రధాని మోదీ తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతున్నారని లోకేశ్ కొనియాడారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారని గుర్తుచేశారు. మొదటి ఏడాది నుంచి ఇప్పటివరకు అదే స్ఫూర్తితో పనిచేస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. "నమో అంటే దేశ ప్రజల నమ్మకం. ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకమే ఆయన బలం" అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa