ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీ సంస్కరణల ద్వారా రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు జరిగింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 05:41 PM

'జీఎస్టీ సూపర్ సేవింగ్స్' ఒక ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని ఆకర్షణీయమైన పథకాలు, సంస్కరణలు తీసుకురానున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గురువారం కర్నూలు జిల్లా శివారు నన్నూరు సమీపంలో నిర్వహించిన 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్' భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర సహాయమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏర్పడిన 'డబుల్ ఇంజిన్ సర్కార్' వల్ల రాష్ట్రానికి రెట్టింపు ప్రయోజనం చేకూరుతోందని అన్నారు. రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు, కేంద్రం తీసుకొచ్చిన సూపర్ జీఎస్టీ తోడవడంతో ప్రజలకు 'సూపర్ సేవింగ్స్' రూపంలో లబ్ధి కలుగుతోందని వివరించారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశవ్యాప్తంగా 99 శాతం వస్తువులు 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయని, ఇది ప్రజలపై పన్నుల భారాన్ని గణనీయంగా తగ్గించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంపై ఇప్పటికే 98 వేల కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించామని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa