రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తీవ్ర విమర్శలు చేశారు. "ట్రంప్ మనకు తండ్రా ఏంటి మన ప్రధాని మౌనంగా ఉంటే, మనకు అన్నీ ఆయనే చెబుతారా దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి" అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.ఈ సందర్భంగా ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ, "రష్యా మన చిరకాల మిత్రుడు. మేం రష్యాకు అండగా నిలుస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ట్రంప్ మనకిస్తేనే మనం రొట్టెలు తింటామా ప్రపంచంలో భారత్ చాలా పెద్ద మార్కెట్, కాబట్టి ట్రంప్ మనల్ని విస్మరించలేరు. ఆయన కేవలం తన ప్రయోజనాల గురించే ఆలోచిస్తారు. చైనాతో విభేదాలు ఉన్నప్పటికీ అమెరికా పాకిస్థాన్కు మద్దతిస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తే మనకు ఎవరూ లేరని, మనం ఎవరికీ చెందినవాళ్లం కాదని అర్థమవుతుంది" అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa