AP: విశాఖపట్నంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువు ఉమాదేవి మృతి చెందింది. దువ్వాడ పోలీసుల వివరాల ప్రకారం.. గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వైపు స్కూటీపై వెళ్తున్న దంపతులను కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉమాదేవి అక్కడికక్కడే మరణించగా, ఆమె భర్త పైడిరాజు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పైడిరాజును ఆస్పత్రికి తరలించారు. పెదగంట్యాడ (M) సీతానగరానికి చెందిన ఉమాదేవి, పైడిరాజుల వివాహం నాలుగు నెలల క్రితమే జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa