ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభిషేక్, స్మృతికి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

sports |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 11:09 AM

సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది. ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌ల్లో 314 పరుగులు చేసిన అభిషేక్ టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో 308 పరుగులు చేసిన స్మృతి 50 బంతుల్లో సెంచరీతో అదరగొట్టింది. ఒకే నెలలో భారత పురుష, మహిళా క్రికెటర్లకు ఈ అవార్డు రావడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa