ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకిలీ మద్యం, రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇలా రోజుకి ఒక దోపిడీ బయటికివస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 11:09 AM

నిన్న నకిలీ మద్యం... నేడు రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా... ఇలా అధికార తెలుగుదేశం నేతల దోపిడీ బాగోతాలు రోజుకొకటి బయటపడుతున్నాయని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రేషన్ మాఫియాలో వాటాల పంపకాల్లో తేడాలు రావడంతో ఈ దందాను టీడీపీ నేత, నుడా చైర్మన్ స్వయంగా బయటపెట్టారని అన్నారు. జిల్లా మంత్రి నారాయణ అనుయాయులే ఈ మాఫియాలో కీలకపాత్ర పోషిస్తున్నారంటూ నుడా చైర్మన్ వెల్లడించడంతో, దానిపై విచారణ చేయించాల్సింది పోయి, మన తప్పులను మనమే బయటపెట్టుకుంటామా అంటూ మంత్రి నారాయణ మండిపడటం మరింత ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. అవినీతి సొమ్మును పంచుకోవాలే తప్ప, అల్లరి చేసుకోవద్దంటూ మంత్రిగా ఉన్న నారాయణే కూటమి ధర్మం గురించి ఉపదేశాలు ఇస్తుండటాన్ని చూసి జిల్లాలోని ప్రజలు నివ్వెరపోయారని అన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంగా టీడీపీ నేతల రేషన్ బియ్యం అక్రమ దందాను వైయస్ఆర్‌సీపీ అడ్డుకుంటుందని, దీనిపై పోరాడుతుందని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa