అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆశించే వేలాది మంది భారతీయులకు నిరాశే ఎదురైంది. ప్రతిష్ఠాత్మక డైవర్సిటీ వీసా (డీవీ) లాటరీ జాబితా నుంచి భారత్ను మినహాయించారు. అమెరికాకు భారతీయుల వలసలు అధికంగా ఉండటమే కారణం. ఈ నిబంధన 2028 వరకు కొనసాగనుంది. గణాంకాల ప్రకారం 2021లో 93,450 మంది, 2022లో 1,27,010 మంది, 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. గత ఐదేళ్లలో ఏ దేశం నుంచైనా 50,000 కంటే తక్కువ మంది అమెరికాకు వలస వచ్చి ఉంటే, ఆ దేశ పౌరులు మాత్రమే ఈ లాటరీకి అర్హులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa