ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తపాలా శాఖని అభివృద్ధి చేస్తాం

national |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 05:01 PM

భారత తపాలా శాఖ తన సేవలను ఆధునికీకరించే దిశగా ఒక భారీ ముందడుగు వేస్తోంది. ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు దీటుగా, దేశంలో ఏ మూలకైనా కేవలం 24 గంటల్లో పార్శిళ్లను చేరవేసే కొత్త విధానాన్ని తీసుకురానుంది. 2026 జనవరి నాటికి ఈ సరికొత్త స్పీడ్ డెలివరీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఇండియా పోస్ట్ ద్వారా వేగంగా పంపినా, పార్శిల్ చేరడానికి మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా మంత్రి సింధియా మరిన్ని వివరాలు వెల్లడించారు. దేశంలోని అన్ని మెట్రో నగరాలు, రాష్ట్ర రాజధానుల్లో 48 గంటల్లో గ్యారెంటీ డెలివరీ సేవలను కూడా 2026 జనవరి నాటికి ప్రారంభిస్తామని తెలిపారు. అంతేకాకుండా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. 2026 మార్చి నాటికి ఈ సంస్థలకు చెందిన వస్తువులను వినియోగదారుల ఇళ్లకు చేర్చే 'లాస్ట్-మైల్ డెలివరీ' సేవలను కూడా ఇండియా పోస్ట్ అందిస్తుందని ఆయన వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa