ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని ఆ జిల్లాకు జాతీయ అవార్డు.. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 06:51 PM

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేంద్రం అవార్డు వరించింది. ధర్తి ఆబా జనభాగీదారి అభియాన్ కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరచినందుకు అల్లూరి జిల్లాను ఈ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఈ అవార్డును స్వీకరించారు. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద స్పందించారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.


మలబద్ధకంతో బాధపడుతున్నారా, ఇప్పుడు చెప్పేవి తింటే క్షణాల్లో కడుపు మొత్తం ఖాళీ అయి చాలా రిలాక్స్‌గా ఉంటారు


"ధర్తి ఆబా జనభాగీధారి అభియాన్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా అవార్డు లభించడం ఆనందంగా ఉంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేసిన ఈ అవార్డు, PM-JGUA, PM-JANMAN చొరవలను అమలు చేయడంలో అల్లూరి జిల్లా చూపించిన ఆదర్శనీయమైన ప్రయత్నాలకు గుర్తింపు. అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యక్తిగత హక్కులు, అర్హతలు, ఫైనాన్షియల్ ఇంక్లూజెన్, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, జీవనోపాధి, గిరిజన, PVTG వర్గాలకు పోషకాహారాన్ని ప్రోత్సహించడంలో ముందుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరాలనే స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తోంది. ఈ విజయాన్ని సాధ్యం చేసిన ప్రజలకు, అధికారులకు హృదయపూర్వక అభినందనలు." అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


మరోవైపు గిరిజన వర్గాలకు సాధికారత కల్పించడంతో పాటుగా వివిధ ప్రభుత్వ పథకాల గురించి వారికి అవగాహన కల్పించడం, వారు ప్రయోజనాలను పొందేలా చూడటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం కింద వివిధ సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేలా శిబిరాలు నిర్వహిస్తారు. ఆధార్ కార్డులు నమోదు, జారీ, జన్ ధన్ ఖాతాలను తెరవడం, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ యోజన వంటి ప్రభుత్వ పథకాలను గిరిజనులకు అందించడం వంటి వివిధ సేవలను ఈ శిబిరాల ద్వారా అందిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివశించే గిరిజనుల కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చారు. బిర్సా ముండా పేరు మీద ఈ పథకానికి ధార్తి ఆబాగా నామకరణం చేశారు.


మరోవైపు గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం కేంద్రం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ను గతంలో తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం కింద అటవీ ప్రాంతంలోని గిరిజన గూడెంలలో అభివృద్ధి పనులు చేపట్టింది. దానికి కొనసాగింపుగా మైదాన ప్రాంతాల్లోని గిరిజనుల కోసం ధర్తి ఆబ జన జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌ తీసుకువచ్చింది. ఈ పథకం కింద ఏపీలోని పలు గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లోని ప్రజల స్థితిగతులపై సర్వే నిర్వహించారు. కుటుంబసభ్యుల వివరాలు, ఆధార్ కార్డులు, రేషన్‌ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, అంత్యోదయ అన్న యోజన కార్డు, గ్యాస్ సిలిండర్లు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఉన్నాయా లేవా అనేది సర్వే నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa