ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తురకపాలెం మరణాల వెనుక ఉన్న నిజాన్ని ప్రభుత్వం బయటికి రానివ్వడంలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 05:41 PM

గుంటూరు జిల్లా, తురకపాలెంలో ప్రజలు మెలిడియోసిస్‌తో చనిపోయారని చెప్పడానికి ప్రభుత్వం వెనకాడుతోందని, అలా చెబితే గ్రామంలో  కలుషిత నీరు సరఫరా చేశామని అంగీకరించాల్సి భయపడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీనాయకులు స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే తురకపాలెంలో 45 మంది చనిపోయారన్న వారు, ఆ మరణాలనీ ప్రభుత్వ హత్యలే అని స్పష్టం చేశారు. పత్తిపాడు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ బాలసాని కిరణ్‌ నేతృత్వంలో పార్టీకి చెందిన వైద్యులు, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్‌మోహన్‌రావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు, సత్తెనపల్లి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి గుంటూరు కలెక్టర్‌ను కలిసి, తురకపాలెంలో పరిస్థితిని వివరించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ...... తురకపాలెంలో ఎస్సీ కాలనీకి క్వారీ గుంతలో నీరు సరఫరా చేసిన విషయం బయటకొస్తుందని ప్రభుత్వం వాస్తవాలు చెప్పడం లేదు. అక్కడ  మెలిడియోసిస్‌ అని తెలిసీ 45 మంది చనిపోయేదాకా నిర్లక్ష్యం వహించిన నిందితులను శిక్షించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగిన మరణాలు కాబట్టే వాస్తవాలు దాచి ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలను అంగీకరించి బాధితులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి అని డిమాండ్ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa