ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నూతన కమిటీల్లో కోవర్టులు, అవకాశవాదులకు చోటులేకుండా చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 05:44 PM

పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ వైఎస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌  తెలిపారు. గతంలో క్యాడర్‌కు జరిగిన నష్టాన్ని గుర్తించిన అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇకపై వారికి తగిన అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కమిటీల్లో కోవర్టులు, అవకాశవాదులకు చోటు లేకుండా యువత, సోషల్‌ మీడియా సభ్యులకు అవకాశం కల్పించాలన్నారు. పంచాయతీల వారిగా క్రియాశీలక కార్యకర్తలు పార్టీ అధినేతతో కలిసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.  కూట‌మి పాల‌న‌లో అన్యాయం జరిగిన వారు, రాజకీయ వేధింపులకు గురయ్యే వారు డిజిటల్‌ బుక్‌ నమోదు చేయాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్‌ కాలేజిల ప్రైవేటీకరణ చేయటానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa