ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నడిరోడ్డుపై గర్బిణిని పొడిచి చంపిన ప్రియుడు.. అదే కత్తితో అతడ్ని పొడిచేసిన ఆమె భర్త

Crime |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 07:38 PM

వివాహేతర సంబంధం కడుపులో బిడ్డ సహా మూడు ప్రాణాలను బలితీసుకుంది. తనను వదిలేసి భర్త దగ్గరకు వెళ్లిపోయిందని ప్రియురాలిపై పగతో రగిలిపోయిన వ్యక్తి.. ఆమెను ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు ఆటోలో వెళ్తుండగా కత్తితో దాడి చేశాడు. ముందు తన ప్రియురాలి భర్తపై దాడి చేయగా.. అతడు తప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఆటోలో ఆమె ఉన్నట్టు గుర్తించి కత్తితో పలుసార్లు పొడిచి చంపాడు. భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన భర్తపై కూడా దాడికి చేశాడు. అయితే, అతడి చేతిలో కత్తిని దొరకబుచ్చుకున్న భర్త.. ప్రియుడ్ని అక్కడికక్కడే కడతేర్చాడు. ఈ దాడిలో గాయపడిన భర్త ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నడిరోడ్డుపై జంట హత్యల ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళ్తే.. షాలిని (22), ఆకాశ్ (23) దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నాయి. ఇ-రిక్షా నడిపే ఆకాశ్‌, భార్య షాలిని మధ్య కొన్నాళ్ల కిందట విబేధాలు రావడంతో వేర్వేరుగా ఉన్నారు. ఈ క్రమంలో స్థానిక నేరస్థుడు ఆషు అలియస్ శైలేంద్ర (34)తో షాలినికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్దిరోజుల పాటు ఇరువురూ సహజీవనం చేశారు. అయితే, భార్యాభర్తల మధ్య విబేధాలు పెద్ద జోక్యంతో సమసిపోవడంతో ఆకాశ్, షాలిని మళ్లీ కలిశారు. అయితే, తనను కాదని మళ్లీ భర్త వద్దకు వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన శైలేంద్ర.. ప్రియురాలిపై ప్రతీకారంతో రగలిపోయాడు. అంతేకాదు, అప్పటికే ఆమె గర్భవతి కావడంతో కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డకు తండ్రిని తానేనని ఆషు భావించాడు.


ఈ క్రమంలో శనివారం రాత్రి భర్తతో కలిసి కుతుబ్ రోడ్డులోని తన తల్లి దగ్గరకు వెళ్తున్న విషయం తెలిసి దారికాచ్చి... తన వెంట తీసుకెళ్లిన కత్తితో ఆకాశా్‌పై దాడిచేయగా.. అతడు తప్పించుకున్నాడు. అనంతరం ఆటోలో కూర్చున్న షాలినిపై విచక్షణరహితంగా పొడవంతో ఆమె తీవ్రంగా గాయపడింది. భార్యను అతడి నుంచి కాపాడుకోడానికి ఆకాశ్ ప్రయత్నించగా.. అతడికి గాయాలయ్యాయి. కానీ, శైలేంద్ర నుంచి కత్తిని లాక్కున్న ఆకాశ్.. అతడ్ని కసితీరా పొడిచాడు. తీవ్ర గాయాలతో ఉన్న షాలిని, ఆకాశ్‌లను ఆమె సోదరుడు రోహిత్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. శైలేంద్రను కూడా పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి షాలిని, ఆమె ప్రియుడు చనిపోయారు. భార్యను కాపాడే క్రమంలో గాయపడిన ఆకాశ్ పరిస్థితి నిలకడగా ఉందని సెంట్రల్ ఢిల్లీ డీసీపీ నిధిన్ వాల్సన్ తెలిపారు.షాలిని తల్లి షైలా వాంగ్మూలం ఆదారంగా ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa