దీపావళి పండుగ వేళ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార బీజేపీ సహా హిందూ సంఘాలు ఆయనపై మండిపడుతున్నాయి. హిందూ వ్యతిరేకి అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అఖిలేశ్ యాదవ్.. అయోధ్యలో ఘనంగా జరిగే దీపావళి దీపోత్సవ వేడుకలను.. క్రిస్మస్తో పోల్చారు. క్రిస్టియన్ల పండుగ నుంచి నేర్చుకోవాలని అన్నారు. దీపావళి దీపాల కోసం చేసే ఖర్చు వృథా అన్న అర్థంలో అఖిలేశ్ యాదవ్ మాట్లాడారు.
ఉత్తర్ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అయోధ్యలో ఘనంగా దీపావళి వేడుకలు జరపడానికి ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అయోధ్యలో 26 లక్షలకు పైగా దీపాలను వెలిగించి గిన్నీస్ రికార్డు సృష్టించాలని చూస్తోంది. అధికారుల చెప్పిన వివరాల ప్రకారం.. రామ్ కీ పైడితో సహా 56 ఘాట్లలో రికార్డు స్థాయిలో 26,11,101 దీపాలు వెలిగిస్తారు. ఈ నేపథ్యంలోనే అఖిలేశ్ యాదవ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
దీపాలపై ఖర్చు ఎందుకు..
"రాముడి పేరు మీద నేను ఒక సూచన ఇస్తాను. ప్రపంచవ్యాప్తంగా.. క్రిస్మస్ సందర్భంగా అన్ని నగరాలు లైట్లతో వెలిగిపోతాయి. నెలల తరబడి అలాగే ఉండేలా చూసుకుంటారు. వాళ్ల నుంచి నేర్చుకోండి. దీపాలు, కొవ్వొత్తుల కోసం మనం పదే పదే ఎందుకు డబ్బులు ఖర్చు చేయాలి? అలాగే దీపాలు పెట్టాలని మనం ఎందుకు ఆలోచించాలి? ఈ ప్రభుత్వం నుంచి మనం ఏం ఆశించవచ్చు? ఆ దీపాలను ప్రభుత్వం తొలగించాలి. మేమైతే దీపాల ప్లేస్లో అందమైన లైట్లు ఉండేలా చూస్తాము" అని అఖిలేష్ యాదవ్ ఒక సభలో ప్రసంగించారు
విదేశీ సంస్కృతే ఆయనకు ముద్దు..!
అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలను అధికార బీజేపీ ఖండించింది. అఖిలేశ్ యాదవ్, ఆయన పార్టీ హిందూ సంప్రదాయాలను తక్కువ చేసేలా మాట్లాడారని చెప్పింది. ఆయోధ్యకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సాంస్కృతిక కార్యక్రమాన్ని.. రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. భారతీయ సంస్కృతి కంటే.. విదేశీ సంప్రదాయాలు గొప్పవని అఖిలేశ్ యాదవ్ కీర్తిస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ ఆరోపించారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. “ఎస్పీ పాలనలో అయోధ్యను అంధకారంలో ఉంచారు. అప్పట్లో రామభక్తులపై అఖిలేశ్ ప్రభుత్వం కాల్పులకు తెగబడింది. కానీ ఇప్పుడు అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఇది అఖిలేశ్ యాదవ్కు సమస్యగా పరిణమించింది. ఇది సనాతన-విరోధి ఎకోసిస్టమ్. రామమందిర ఉద్యమాన్ని వ్యతిరేకించిన, అయోధ్యను సంవత్సరాల తరబడి అంధకారంలో ఉంచిన, రామభక్తులపై దాడి చేయడంలో కూడా గర్వపడే చరిత్ర కలిగిన పార్టీ.. ఇప్పుడు దీపోత్సవాన్ని కూడా వ్యతిరేకిస్తోంది.” అని ఘాటుగా విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa