కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే, ఒకవేళ ఇన్ఫోసిస్ సంస్థ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్కు మార్చుకుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తల పట్ల ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని ఆయన మండిపడ్డారు. కులగణనలో పాల్గొనబోమంటూ తమ హక్కును వినియోగించుకున్నందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన అర్ధాంగి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తిని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అవమానించేలా మాట్లాడారని కుమారస్వామి ఆరోపించారు. "మీ అవసరం మాకు లేదు" అన్నట్లుగా పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa