ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాల కారణంతో ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 01:19 PM

రాష్ట్రంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పలు జిల్లాలకు హెచ్చరికలు వచ్చిన క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. రెడ్‌ అలర్ట్‌ ఉన్న జిల్లాల్లో అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలన్నారు. డ్రైనేజీలు, కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తక్షణమే తొలగించాలన్నారు. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa