ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులో దారుణం, మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు

national |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 02:35 PM

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన ఐదుగురు దుండగులు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, నగదు, మొబైల్ ఫోన్లు దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు రూరల్ జిల్లా పరిధిలోని గంగొండనహళ్లిలో మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది. రాత్రి 9:15 గంటల సమయంలో ఓ ఇంటి తలుపు తట్టిన ఐదుగురు వ్యక్తులు, లోపల ఉన్నవారు తలుపు తీయగానే బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. దుండగులు వారిని బెదిరించి, ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనపై బెంగళూరు రూరల్ ఎస్పీ సీకే బాబా మాట్లాడుతూ "నిందితులు లైంగిక దాడి చేయడమే కాకుండా, ఇంట్లో నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ. 25,000 నగదును దోచుకెళ్లారు" అని తెలిపారు. బాధితురాలి పెద్ద కుమారుడు అర్ధరాత్రి 12:30 గంటలకు పోలీసులకు సమాచారం అందించడంతో సీనియర్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన వివరించారు.బాధితురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని, కొంతకాలంగా ఇక్కడ నివసిస్తున్నారని పోలీసులు గుర్తించారు. నిందితులు కూడా అదే ప్రాంతానికి చెందిన వారిగా తేలింది. "బాధితురాలు ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నిందితులకు, బాధితురాలికి ముందే పరిచయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం" అని ఎస్పీ సీకే బాబా పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa