ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్‌బీఐ కార్డ్ ఛార్జీలు పెంపు.. రూ.1000 దాటితే బాదుడే

business |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 11:36 PM

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్నారా? అయితే మీకో బిగ్ అలర్ట్. ఎస్‌బీఐ కార్డ్ ఛార్జీలు సవరించింది. వివిధ రకాల సేవలపై ఫీ పెంచుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. సవరించిన కొత్త ఛార్జీలను నవంబర్ 1, 2025 నుంచే అమలులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఎస్‌బీఐ కార్డ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే రూ.1000 దాటితేనే భారీగా ఛార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్ పేమెంట్లు, డిజిటల్ వాలెట్ లోడింగ్, కార్డుల మార్పిడి వంటి ట్రాన్సాక్షన్లను ఈ కొత్త ఛార్జీలు ప్రభావితం చేయనున్నాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


థర్డ్ పార్టీ యాప్స్‌తో విద్యా చెల్లింపులు


క్రెడ్, మొబి క్విక్, చెక్ వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లతో ఎడ్యుకేషన్ సంబంధిత చెల్లింపులు చేసినట్లయితే ఇకపై కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. లావాదేవీ మొత్తంలో 1 శాతం మేర ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ కార్డ్ వెల్లడించింది. అయితే నేరుగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పీఓఎస్ ద్వారా నేరుగా పేమెంట్లు చేసినట్లయితే వాటికి ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.


 వాలెట్ లోడింగ్ రూ.1000 దాటితే బాదుడే


వాలెట్ లోడింగ్ రూ.1000 దాటితే ఇకపై బాదుడే బాదుడు. వాలెట్ లోడింగ్ లావాదేవీలు రూ.1000కి మించి చేసినప్పుడు 1 శాతం ట్రాన్సాక్షన్ అమౌంట్ ఫీ చెల్లించాల్సి వస్తుంది. ఎంపిక చేసిన మెర్చంట్ కోడ్స్‌ పరిధిలోని లావాదేవీలకు ఈ కొత్త ఛార్జీలు ఉంటాయని ఎస్‌బీఐ కార్డ్ పేర్కొంది. థర్డ్ పార్టీ మెర్చంట్ల ఎడ్యుకేషన్ పేమెంట్ ఛార్జీలు మెర్చంట్ కేటగిరీ కోడ్‌ల ఆధారంగా విభజించింది. అవి ఎంసీసీ 8211, 8220, 8241, 8244, 8249, 8299గా తెలిపింది.


ఇతర ఛార్జీలు


నగదు చెల్లింపులు, చెక్ పేమెంట్స్, కార్డ్ రీప్లేస్మెంట్, ఆలస్యంగా చెల్లింపుల వంటి సర్వీసులకు ఛార్జీలు వసూలు చేస్తామని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది. ప్రస్తుతానికి అయితే ట్రాన్సాక్షన్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు చేయలేదని తెలిపింది. ప్రస్తుతం నగదు పేమెంట్లకు రూ.250, పేమెంట్ ఆలస్యమైతే 2 శాతం ఫీ పడుతుంది. ఇది కనీస ఫీ రూ.500గా ఉంటుంది. చెక్ పేమెంట్ ఛార్జీలు రూ.200గా ఉన్నట్ల తెలిపింది. క్యాష్ అడ్వాన్స్ ఫీ ఎస్‌బీఐ ఏటీఎ కేంద్రాల్లో, ఇతర దేశీయ ఏటీఎంలల్లో 2.5 శాతంగా నిర్ణయించింది. కనీసం రూ.500గా పేర్కొంది. ఇంటర్నేషనల్ ఏటీఎంల్లో క్యాష్ అడ్వాన్స్ ఫీ 2.5 శాతంగా వసూలు చేస్తున్నట్లు తెలిపింది.


కార్డ్ రీప్లేస్మెంట్ ఛార్జీలు రూ.100 నుంచి రూ.250 మధ్య నిర్ణయించింది. ఆరమ్ కార్డులకు అయితే రూ. 1500 వరకు ఉంటుంది. విదేశాల్లో ఎమర్జెన్సీగా కార్డ్ మార్చుకోవాలంటే కనీస ఫీ వీసా కార్డులకు అయితే 175 డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. మాస్టర్ కార్డులకు అయితే 148 డాలర్లుగా నిర్ణయించింది. లేట్ పేమెంట్ ఛార్జీలు రూ.500 వరకు జీరోగా ఉండగా రూ. 500 నుంచి రూ. 1000 వరకు అయితే రూ. 400 పడుతుంది. రూ.1000 నుంచి రూ.10 వేల పేమెంట్లపై రూ.750 వరకు ఫీ కట్టాలి. రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు లేట్ పేమెంట్లు అయితే రూ. 950 వరకు ఫీజు పడుతుంది. రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు అయితే రూ.1100 మేర లేట్ పేమెంట్ ఛార్జీలు పడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa