కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద స్థలాన్ని కర్నూలు కలెక్టర్ సిరి పరిశీలించారు. బైక్ బైస్సు కిందకు వెళ్లడంతో బస్సులోని ఓ కేబుల్ తెగిపోయిందని తెలిపారు. అనంతరం మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. బస్సు నుంచి 11 మృతదేహాలు వెలికితీసినట్లు పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడని.. అతని గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. బస్సు ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు.. కలెక్టరేట్లో: 08518-277305, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059, ఘటనాస్థలి వద్ద: 91211 01061, కర్నూలు పోలీసు స్టేషన్: 91211 01075, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో: 94946 09814, 90529 51010. ఏవైనా సమస్యల ఉంటే కంట్రోల్ రూమ్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కలెక్టర్ సిరి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa