సాంకేతిక రంగంలో భారతీయుల ప్రతిభ మరోసారి ప్రపంచానికి చాటిచెప్పబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, తాడిపత్రికి చెందిన కొడుకు కొనుదుల సాత్విక్ రెడ్డి అద్భుత విజయాన్ని సాధించారు. ప్రతిష్ఠాత్మక గూగుల్ సంస్థలో ఉద్యోగం సంపాదించి, తన సొంత జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల కీర్తిని పెంచారు. న్యూయార్క్లోని ప్రఖ్యాత స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన సాత్విక్, కాలిఫోర్నియాలోని గూగుల్ కంపెనీలో కీలక స్థానం దక్కించుకున్నారు.
సాత్విక్ రెడ్డి సాధించిన ఈ విజయం అతడి కృషి, పట్టుదలకు నిదర్శనం. అమెరికాలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేయడమే కాక, ప్రపంచంలోనే అగ్రగామి టెక్ కంపెనీలలో ఒకటైన గూగుల్లో కొలువు దక్కించుకోవడం విశేషం. ఈ ఉద్యోగానికి గాను సాత్విక్ రెడ్డి ఏడాదికి ఏకంగా రూ. 2.25 కోట్ల భారీ వేతనాన్ని అందుకోనున్నట్లు ఆయన తండ్రి కొనదుల రమేశ్ రెడ్డి సంతోషంగా వెల్లడించారు. ఈ వార్త తాడిపత్రి ప్రాంతంలోనే కాక, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల్లో ఆనందాన్ని నింపింది.
అనంతపురం జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీ రంగంలో బలమైన మూలాలు ఉన్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగుతున్న సత్య నాదెళ్ల స్వస్థలం కూడా అనంతపురం జిల్లానే కావడం గమనార్హం. ఇప్పుడు సాత్విక్ రెడ్డి కూడా అదే జిల్లా నుండి వచ్చి, ప్రపంచ స్థాయి కంపెనీలో అత్యంత కీలక ఉద్యోగాన్ని సాధించడం యువతకు స్ఫూర్తిదాయకం. ఇది కేవలం ఒక వ్యక్తి విజయం మాత్రమే కాదు, అపారమైన ప్రతిభ కలిగిన భారతీయులకు సరైన అవకాశాలు లభిస్తే వారు సాధించగలిగే అద్భుతాలకు ప్రతీక.
సాత్విక్ రెడ్డి విజయగాథ, మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు కూడా నాణ్యమైన విద్య, పట్టుదలతో ప్రపంచ వేదికపై తమదైన ముద్ర వేయగలరని నిరూపించింది. టెక్నాలజీ రంగంలో గ్లోబల్ కెరీర్ లక్ష్యంగా పెట్టుకున్న ఎందరో యువ ఇంజనీర్లకు సాత్విక్ స్ఫూర్తిగా నిలుస్తారు. అనంతపురం జిల్లాలో మరో టెక్నాలజీ స్టార్ ఉద్భవించిన ఈ సందర్భంగా, అతడి భవిష్యత్తు ప్రయాణం మరింత విజయవంతం కావాలని కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa