నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో సత్యప్రమాణం చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయన, ఘాట్ రోడ్డు ప్రవేశద్వారం వద్ద చేతిలో దీపం వెలిగించి, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. "నా వ్యక్తిత్వంపై నింద వేశారు. నా మనసును గాయపరిచారు. అందుకే కుటుంబంతో సహా వచ్చి, ఏ తప్పు చేయలేదని అమ్మవారి ఎదుట నిండు మనసుతో ప్రమాణం చేశాను. నా కుటుంబాన్ని అవమానించిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలి" అని అన్నారు.ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. "నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారు సత్యప్రమాణానికి సిద్ధమా? కనీసం లైడిటెక్టర్ టెస్టుకైనా వచ్చే దమ్ముందా? కనకదుర్గమ్మ సాక్షిగా నేను తప్పు చేసినట్లు నిరూపించాలి" అని సవాల్ విసిరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa