భారత్ పర్యటనకు సన్నద్ధమవుతున్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టు తమ 15 మంది టెస్టు జట్టును అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో సఫారీలు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లలో టీమిండియాతో తలపడనున్నారు.సుమారు నెలరోజులపాటు సాగనున్న ఈ సుదీర్ఘ సిరీస్పై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. గాయం కారణంగా ఇటీవల పాకిస్థాన్ సిరీస్కు దూరమైన కెప్టెన్ తెంబా బావుమా ఈసారి తిరిగి జట్టులోకి చేరి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆయన రీ-ఎంట్రీతో సఫారీ జట్టు మరింత బలంగా కనిపిస్తోంది. పాక్ సిరీస్లో ఆడిన చాలా మంది కీలక ఆటగాళ్లు ఈ టెస్టు జట్టులో కొనసాగారు.సఫారీ జట్టు నవంబర్ 14న ప్రారంభమయ్యే మొదటి టెస్టుతో భారత్ పర్యటనను ప్రారంభిస్తుంది. మొదటి టెస్టు నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్కతాలో, రెండో టెస్టు నవంబర్ 22 నుంచి 26 వరకు గువాహటిలో జరగనుంది. అనంతరం మూడు వన్డేలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు రాంచీ, రాయ్పూర్, విశాఖపట్నం వేదికలపై జరుగుతాయి. ఆ తర్వాత ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ డిసెంబర్ 9 నుంచి 19 వరకు కొనసాగుతుంది. వీటికి కటక్, ముల్లాన్పూర్, ధర్మశాల, లఖ్నవూ, అహ్మదాబాద్ వేదికలు నిర్ణయించబడ్డాయి.
*సౌతాఫ్రికా టెస్టు జట్టు:తెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హర్మర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరినె.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa