ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ .. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. ప్యాట్ కమిన్స్ గాయంతో దూరం కావడంతో పెర్త్ వేదికగా నవంబర్ 21 నుంచి జరిగే టెస్టు మ్యాచ్కు స్మిత్ సారథిగా ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. బజ్బాల్ పప్పులు.. ఆస్ట్రేలియాలో ఉడకవని జోస్యం చెప్పాడు. ఆస్ట్రేలియాలో పరిస్థితులు మారిపోయాయని.. తమ బౌలర్లను ఇంగ్లాండ్ బ్యాటర్లు తట్టుకోవడం కష్టమని చెప్పుకొచ్చాడు.
“ఆస్ట్రేలియాలో పరిస్థితులు భిన్నంగా ఉండబోతున్నాయి. గత మూడు లేదా నాలుగేళ్లుగా బ్యాటర్లకు, ముఖ్యంగా టాప్ ఆర్డర్కు సవాల్గా మారింది. ఇక్కడ పిచ్లు పూర్తిగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మా బౌలర్లు.. బ్యాటర్లపై ఆధిపత్యం చలాయిస్తారు. దీంతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఇంగ్లాండ్ బజ్బాల్ ఆటలు ఇక్కడ సాగవు” అని స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించాడు.
కేక పుట్టించే ఎపిసోడ్
కాగా ఆస్ట్రేలియాలో టెస్టుల్లో 2021-22 యాషెస్ తర్వాత టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోతున్నారు. ఈ సమయంలో తొలి ఏడుగురు బ్యాటర్ల సగటు 30.22గా ఉంది. గత 20 టెస్టులలో ఇక్కడ 24 సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి.
ఇక ఇటీవల కాలంలో యాషెస్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 2015 నుంచి యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ విజేతగా నిలవలేదు. మరీ ముఖ్యంగా రెండు దశాబ్దాలుగా ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవలేదు. 2021-22లో ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్లో 0-4 తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. రెండేళ్ల తర్వాత తమ దేశంలో జరిగిన యాషెస్ సిరీస్ను 2-2తో డ్రా చేసుకుంది.
యాషెస్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్..
తొలి టస్టు: నవంబర్ 21 - 25 (పెర్త్ క్రికెట్ స్టేడియం)
రెండో టెస్టు: డిసెంబర్ 4 - 8 (గబ్బా క్రికెట్ స్టేడియం)
మూడో టెస్టు: డిసెంబర్ 17 - 21 (ఆడిలైడ్ ఓవల్ స్టేడియం)
నాలుగో టెస్టు: డిసెంబర్ 26 - 30 (మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్)
ఐదో టెస్టు: జనవరి 4 - 8 (సిడ్నీ క్రికెట్ గ్రౌండ్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa