కర్ణాటకలోని కొప్పళ జిల్లా కుకనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బెణకల్ గ్రామంలో సోమవారం లక్ష్మి భజంత్రి (30) తన ఇద్దరు పిల్లలు రమేశ్ (3), జానవి(2)లను హతమార్చి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన బీరప్ప అనే వ్యక్తితో లక్ష్మికి వివాహేతర సంబంధం ఉందని, అతని ఒత్తిడిని తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడిందని మృతురాలి తల్లి బసవ్వ ఆరోపించారు. తొలుత పిల్లలను ఉరి తీసి, ఆ తర్వాత లక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa