ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రఫేల్‌ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ముర్ము

national |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 02:59 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంబాలా వైమానిక దళ కేంద్రం నుంచి రాఫెల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌పై భారత్ ప్రయోగించిన రాఫెల్ విమానంలోనే ఆమె ప్రయాణించారు. రాష్ట్రపతి యుద్ధ విమానంలో విహరించడం ఇది రెండోసారి. భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ విమానాన్ని నడిపారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారతదేశం ఈ రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa